భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తనను తాను అఘోరగా చెప్పుకుంటూ, అఘోర ముసుగులో అరాచకాలు చేస్తున్న కాళీ అలియాస్ నందగిరిని ఉజ్జయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏపీ , తెలంగాణలో అనేక కేసులలో అరెస్ట్ అయిన నందగిరి అనే పేరుతో ఇతడు చలామణి అవుతుంటాడు. కిన్నెర అఖార మహా మండలేశ్వరగా కూడా ప్రచారం చేసుకుంటుంటాడు. ఉజ్జయినిలో అనుమతి లేకుండా రాత్రి సమయంలో స్మశానం లోకి ప్రవేశించి చక్ర తీర్థ స్మశానంలో కాలుతున్న శవాల నుంచి మాంసం కట్ చేసి తినడం దాన్ని వీడియో గా చేయడం జరిగింది.

మంగళవారం నాటి ఈ సంఘటనకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. దీన్ని వీడియోలో చూసిన స్మశానం కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది . దీంతో పోలీసులు నందగిరిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడిని రిమాండ్ కి పంపింది. ఇదిలా ఉండగా ఇలాంటి వికృతి చర్యలను మహామండలేశ్వర్ శైలేశ్వరానందగిరి ఖండించారు .

నందగిరిలాంటివారిని సభ్య సమాజానికి దూరంగా ఉంచాలని, ప్రచారం కోసం ఇలాంటి నీచమైన పనులు చేస్తుంటారని అన్నారు…