భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌ కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నిమిత్తం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు.

ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్‌తో పాటు పలువురు కీలక వ్యక్తులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.