భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్బీఐ చైర్మన్ శెట్టి
2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్బీఐ చైర్మన్ శెట్టి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2030 నాటికి తన మొత్తం వ్యాపారాన్ని రూ. 200 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ సీ. శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రస్తుత వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే, టర్నోవర్ రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 100 లక్షల కోట్ల వ్యాపార మైలురాయిని దాటింది. భారత ఆర్థిక వ్యవస్థ 7-8% వృద్ధి చెందితే, ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ 11-12% వార్షిక వృద్ధిని సాధించగలదని, దీని ప్రకారం 2030 నాటికి వ్యాపారం రూ. 200 లక్షల కోట్లకు చేరవచ్చని శెట్టి వివరించారు.
