భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు!
అమరావతి :

ఏపీ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నేడు తిరుపతి, కర్నూలు, అనంతపురం, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.