…భారత్ న్యూస్ హైదరాబాద్…జడ్చర్ల మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం

జడ్చర్ల చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోనేటి పుష్పలత

జడ్చర్ల మున్సిపాలిటీకి 2021లో ఎన్నికలు జరగగా 27 కౌన్సిలర్‌ స్థానాలకు 23 బీఆర్‌ఎస్‌, చెరో రెండు స్థానాలు బీజేపీ, కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి.

ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీ భర్త పెత్తనం చెలాయిస్తుండడంతో, అందరూ కలిసి దోరేపల్లి లక్ష్మీపై జూలై 25న అవిశ్వాస తీర్మాణం పెట్టి దించారు.

ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత చైర్‌పర్సన్‌ ఎన్నికను నిర్వహించగా మెజారిటీ బలం ఉన్న బీఆర్‌ఎస్‌ మళ్లీ పీఠాన్ని దక్కించుకుంది….