భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి 301 శౌర్య పతకాలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొత్తం 301 శౌర్య పతకాలను పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రదానం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వీటిల్లో 272 పోలీసులకు, 29 అగ్నిమాపక సిబ్బందికి అందజేసినట్లు హోం శాఖ తెలియజేసింది. సంబంధిత అధికారి విధులను పరిగణనలోకి తీసుకొని ప్రజల ప్రాణాలను, వారి ఆస్తిని కాపాడటంలో లేదా నేరాలను అరికట్టడంలో, నేరస్థులను పట్టుకోవడంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ శౌర్యపతకం ప్రదానం చేస్తారు” అని హోంశాఖ పేర్కొంది.