.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు

ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా
నమోదుకు తొలివిడతలో 17,404 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 4,464మంది దరఖాస్తు చేయగా, అతి తక్కువగా అల్లూరి జిల్లా నుంచి 1,749 మంది మాత్రమే దరఖాస్తు చేశారు.

ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి ఆఫ్లైన్లో 12,602మంది, ఆన్లైన్లో 4,802 మంది మొత్తం17,404 మంది దరఖాస్తు చేసుకున్నారు.