భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో..
నేపాల్లోని త్రిశూల్ 3A టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రెస్క్యూ బృందాలు రక్షించాయి. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు రావడంతో వారు అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా 9 రోజుల తర్వాత నేడు కబీర్ మహార్జన్, సంజయ్ షాలను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. టన్నెల్ లోపలి నుంచి చాలా మంది గొంతులు వినిపిస్తుండగా వారినీ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
