భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..బ్రేకింగ్ న్యూస్:
కొండపి వద్ద RTC బస్సు బోల్తా
ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయాన్నే పెను ప్రమాదం తప్పింది. కొండపి నుంచి సంతనూతలపాడు మీదగా ఒంగోలు వెళ్లే RTC బస్సు మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ వద్ద రోడ్డు మలుపులో అదుపుతప్పి ఒక పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 15 మందికి స్వల్ప గాయాలు కాగా కండక్టర్కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

