భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వాట్సాప్లో కరెంట్, గ్యాస్ బిల్లు కట్టేయొచ్చు!
📌మెటా కీలక నిర్ణయం.. ఫోన్పే, గూగుల్పేలకు గట్టి పోటీ!
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. చాటింగ్ లకే పరిమితం కాకుండా భారత వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. రోజూవారీ అవసరాలైన విద్యుత్, గ్యాస్, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు బిల్లులతో పాటు ఈఎంఐలు చెల్లించేం దుకు ‘బిల్ పేమెంట్’ ఫీచర్ను ప్రారంభించింది. భారత్ కనెక్ట్ నెట్వర్క్ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్తో.. దేశవ్యాప్తంగా 30 విభాగాల్లో ఉన్న 22వేలకు పైగా బిల్లింగ్ కంపెనీలకు నేరుగా చెల్లింపులు చేయవచ్చు. డిజి టల్ పేమెంట్ మార్కెట్లో 80శాతానికి పైగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఫోన్పే, గూగుల్పే యాప్ల కు వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త సేవలతో గట్టి పోటీ ఎదురుకానుంది.
