భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..చిరిగిన, పాడైన నోట్లను మార్చుకోవడం ఎలా?

చిరిగిన, మురికిగా మారిన కరెన్సీ నోట్లను మార్చుకునే చట్టబద్ధమైన హక్కు పౌరులకు ఉందని RBI నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకు శాఖలోనైనా వీటిని ఉచితంగా మార్చుకోవచ్చు. ఒకవేళ బ్యాంకులు నోట్లు మార్చడానికి నిరాకరిస్తే, నెల రోజుల్లోపు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే ‘RBI CMS పోర్టల్’ లేదా ‘14448’ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అంబుడ్స్ మన్ ను ఆశ్రయించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.