భారత్ న్యూస్ విజయవాడ…పోలీసులు పై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

పల్నాడు జిల్లా…
నరసరావుపేట

పోలీస్ శాఖపై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం నరసరావుపేట డీఎస్పీ కే. నాగేశ్వరరావు అన్నారు.

ఎన్ఆర్ టి రూరల్ పోలీసులపై మదర్ వలి అనే వ్యక్తి అసత్యాలతో వీడియో విడుదల చేయటం జరిగిందన్నారు.

దీనిపై తమ విచారణలో తాను భయపడి వాస్తవం తెలుసుకోకుండా ఓ కేసుకు సంబంధించి వీడియో రిలీజ్ చేశానని అతనే స్వయంగా తెలిపారన్నారు.

సోషల్ మీడియాల్లో అవాస్తవాలు ప్రచారం చేయవద్దన్నారు.