భారత్ న్యూస్ హైదరాబాద్….శ్రీ చైతన్య కాలేజీలో ఫ్యాన్కు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ – నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవాళ ఉదయం తోటి విద్యార్థులు నిద్రలేచి చూసేసరికి జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు సమాచారం అందించారు.
మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..
