భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల…

ఏపీ పీజీసెట్‌ (APPGCET) 2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనరేట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది.

సెప్టెంబర్‌ 3 నుంచి 8 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అనంతరం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, వెబ్‌ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగనుంది.

కాగా, మేలోనే పీజీసెట్‌ ఫలితాలు వెలువడినా.. దాదాపు మూడు నెలల తర్వాత కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు….