భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..నాగర్ కర్నూలు జిల్లా….

చిరుతపులి కూన రోడ్డు ప్రమాదంలో మృతి

రేపు ఉదయం పశువైద్యాధికారులు, NTCA ప్రతినిధి సమక్షంలో పోస్ట్‌మార్టం..

మన్ననూర్–శ్రీశైలం హైవేపై రోడ్డు ప్రమాదంలో చిరుతపులి కూన మృతి

అమ్రాబాద్ డివిజన్‌లోని మన్ననూర్ రేంజ్ పరిధిలో ఘటన

మన్ననూర్ సెక్షన్ గుండం ‘E’ బీట్‌లోని కంపార్ట్‌మెంట్ నెం.331 వద్ద ప్రమాదం

ఆదివారం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో గుర్తించిన అటవీ అధికారులు

గస్తీ నిర్వహిస్తున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు గురువయ్య, గీత

సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన మృతిచెందిన చిరుత కూన గుర్తింపు

వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు

ఉన్నతాధికారులకు సమాచారం అందించిన అధికారులు

NTCA మార్గదర్శకాల ప్రకారం మృతదేహాన్ని భద్రపరిచిన అధికారులు

ఘటనపై తదుపరి విచారణకు అధికారిక బృందాల ఏర్పాటు