భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీకి మరో నేషనల్ హైవే!!!
ఏపీని తూర్పు భారతదేశంతో అనుసంధానించే ఖరగ్పూర్ – అమరావతి కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1,107 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో 457 కిలోమీటర్లు ఏపీ మీదుగా వెళ్లనుంది. ఈ కారిడార్తో రాష్ట్రంలో మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరిగి.. ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
