భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో నేటి నుంచి ఈ-పంట నమోదు

ఏపీలో రబీ సీజన్ కు సంబంధించి సాగుచేసిన ప్రతి పైరునూ నమోదు చేసే ఈ పంట కార్యక్రమం నేటి
నుంచి ప్రారంభం కానుంది.

జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ఠ నిడివి 50 మీటర్లలోపు పంట వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు.

వచ్చే ఏడాది మార్చి 15 నాటికి జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు.ఏవైనా ప్రభుత్వ పరిహారాలు అందాలంటే ఇందులో నమోదుచేసుకోవడం
తప్పనిసరి.