భారత్ న్యూస్ విజయవాడ…ఖరీఫ్లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది. అక్టోబర్ 29న 54 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాం. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు ఉంది. 1.06 లక్షల హెక్టార్ల పంట, 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా
ఆదుకోవడానికి ఇన్ ఫుట్ సబ్సిడీ రూపంలో రూ.159.2 కోట్లు మంజూరు చేశాం, అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. కరువు బారిన పడిన నష్టపోయిన వారందరికీ సహాయం చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. _ మంత్రి అచ్చెన్నాయుడు…
