ఈపీఎఫ్‌ ఖాతాల్లోకి వడ్డీ జమ.. చెక్‌ చేసుకోండిలా!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఈపీఎఫ్‌ ఖాతాల్లోకి వడ్డీ జమ.. చెక్‌ చేసుకోండిలా!

ఈపీఎఫ్ఓ (EPFO) గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది.

ఇప్పటికే 80% మందికి పైగా ఖాతాల్లో వడ్డీ చేరగా.. జులై 15 నాటికి అందరికీ జమ కానుంది. మీ ఖాతాలో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడానికి, మెంబర్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ‘View Passbook’ ద్వారా బ్యాలెన్స్ చూడవచ్చు.

అలాగే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899 కు ఎస్‌ఎంఎస్ పంపి తెలుగులో వివరాలు తెలుసుకునే సదుపాయం కూడా కల్పించారు.