ప్రభుత్వ విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ప్రభుత్వ విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, ఈ ఏడాది ఏకంగా 1.06 లక్షల మంది కొత్త విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడం సంతోషకరమన్నారు. ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు.. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.. ప్రొద్దుటూరు దొరసానిపల్లి ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.