భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఆగస్టు నుంచి అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు: సీతక్క
తెలంగాణ :
వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ను అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం,
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు.
చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గుడ్లు, పాలు, ఇతర సరకుల సరఫరాలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.
