భర్తలను చంపించే భార్యలు ప్లాన్లు చూస్తుంటే కొత్త రకం క్రైమ్ స్టోరీలు వీళ్ళ

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..భర్తలను చంపించే భార్యలు ప్లాన్లు చూస్తుంటే కొత్త రకం క్రైమ్ స్టోరీలు వీళ్ళ వ్యూహాలను చూసి చేస్తున్నారేమో అనిపిస్తుంది. బీహార్లోని సౌపాల్ డివిజన్లో సమిత అనే ఓ మహిళ రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తోంది . ఈమె ప్రియుడు సాయంతో తన భర్తను చంపించిన విధానం భయానకంగా ఉంటుంది. సమిత భర్త దేవకుమార్ గుంజన్ ఆమె ఉంటున్న పట్టణానికి సమీపంలోనే రైల్వే శాఖలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ గా పని చేస్తాడు. భార్యను కష్టపడి చదివించి అధికారిని చేశాడు. తను4రోజు రైల్లోనే డ్యూటీ కి పోయి వస్తుంటాడు. ఆమెకు ఇటీవల కాలంలో అజిత్ కుమార్ అనే వ్యక్తి పరిచయమై అదీ ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. తన అక్రమ సంబంధాలకు భర్త అడ్డొస్తాడేమోనన్న భయంతో భర్త ను ఎలాగైనా చంపించమని ప్రియుడు ధీరజ్ ను కోరింది. దీంతో అతడు ఓ కాంట్రాక్టు కిల్లర్ ను మాట్లాడుకున్నాడు. రైల్లో వస్తున్నప్పుడే కాల్చి చంపేస్తే విచారణలో అయోమయం ఉంటుందని రైల్వే అధికారులకు విచారణ చేసే అంత తీరిక కూడా ఉండదని భావించారు. అందువల్ల ట్రైన్ లో వస్తున్నప్పుడే దేవకుమార్ ను తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ తర్వాత నిందితులు పారిపోయారు. గత నెల 11వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో రైల్వే పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా కలిసి ఎస్పీ ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా వివిధ దశల్లో సిసి కెమెరాలు మరియు మృతుడి భార్య కాల్ రికార్డ్స్ ఆ కాల్ రికార్డ్స్ కు సంబంధించిన వ్యక్తుల వివరాలు ఇలా అన్నింటినీ కూడా పరిశీలించుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి మృతుడి భార్య సమితను అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖలో అధికారిగా ఉండి ఆమె ఇంత దారుణం చేసిందంటే నమ్మలేకపోయారు. అయితే ఆ తర్వాత ఆమె చెప్పింది ఆధారంగా చేసుకుని ఆమె ప్రియుడును కాంట్రాక్టు కిల్లర్స్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజం బయట పడింది .దీంతో నిన్న అందర్నీ జైలుకు పంపారు…