ఇంటర్ విద్యార్థులకు అప్‌డేట్.. ప్రాక్టికల్ పరీక్షల విధానంలో భారీ మార్పులు

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..ఇంటర్ విద్యార్థులకు అప్‌డేట్.. ప్రాక్టికల్ పరీక్షల విధానంలో భారీ మార్పులు

తెలంగాణ :

ఇంటర్మీడియట్ విద్యా మండలి సైన్స్ గ్రూపుల ప్రాక్టికల్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది.

ఇకపై ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు విడివిడిగా 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

మొదటి సంవత్సరం పరీక్ష 1 గంట 30 నిమిషాల పాటు ఉంటుంది. ఈ నూతన విధానాన్ని అన్ని కళాశాలల్లోనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

విద్యార్థులు ప్రాక్టికల్ రికార్డ్ బుక్స్ సమర్పించాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి.