ఒకప్పుడు తుపాకీ చేత పట్టారు.. ఏళ్లపాటు అడవుల్లో బతికారు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఒకప్పుడు తుపాకీ చేత పట్టారు.. ఏళ్లపాటు అడవుల్లో బతికారు. ప్రజా పోరుబాటలో నడిచారు. తరువాత జన జీవన స్రవంతిలో కలిశారు. ఆదుకుంటామన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని చర్ల ప్రాంత మాజీ మావోయిస్టుల దుస్థితిపై ప్రత్యేక కథనం…

చర్ల మండలం రాళ్లాపురానికి చెందిన కరటం ఇడమయ్య ఆయన భార్య జమిలీ మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజియన్ కమిటీ(సీఆర్సీ) టీమ్-2లో పని చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్లో పని చేసి దేవ ప్రొటెక్షన్ జట్టులో కీలకంగా వ్యవహరించారు. పరిస్థితులు బాగాలేక 2017లో తెలంగాణలో నాటి పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. అప్పట్లో చెరో రూ.5 వేల చెక్కు ఇచ్చారని, తేదీ అయిపోవడంతో ఓ చెక్కు డబ్బులు తీసుకోలేదన్నారు. ఇద్దరికీ రూ.4 లక్షల చొప్పున రివార్డు, మూడెకరాల భూమి ఇస్తామని ప్రకటించినా ప్రభుత్వం నుంచి అందలేదని వాపోతున్నారు. వ్యవసాయ, కూలి పనులు చేసుకొని బతుకీడుస్తున్నామన్నారు.