భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
- పవన్ కళ్యాణ్ గారి లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు.

గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
