భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం.ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
గురువారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడే ఛాన్సుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
