ఆహార కల్తీ, డ్రగ్స్‌ అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత్ న్యూస్ వరంగల్…ఆహార కల్తీ, డ్రగ్స్‌ అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ :

ఆహార కల్తీ, డ్రగ్స్‌ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆహార కల్తీ వల్ల క్యాన్సర్‌, ఇతర వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యల అమలుకు సిద్ధమైంది.

ఆహార భద్రత, డ్రగ్‌ కంట్రోల్‌ శాఖల విలీనం ప్రతిపాదించింది. ఒకే HOD ఆధ్వర్యంలో కొత్త సమగ్ర సంస్థ ఏర్పాటు చేయనుంది.

అమలుకు గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాల పునర్‌వ్యవస్థీకరించనుంది.