భారత్ న్యూస్ వరంగల్…మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ!
తెలంగాణ :
రాష్ట్రంలో ఎరువుల పంపిణీ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎరువుల పంపిణీ సులభతరం చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఎంపిక చేసిన సంఘాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది.
మహిళా సంఘాల సొంత భవనాల్లో ఎరువులను నిల్వ చేసుకునే వీలుపై మంత్రి తుమ్మల ఆధికారులతో ఆలోచన చేస్తున్నారు.

ప్రయోగాత్మకంగా కొన్ని సంఘాలను ఎంపిక చేసి, వాటికి లైసెన్స్లు జారీ చేయడంతోపాటు యూరియా యాప్ వినియోగం, ఎరువుల క్రయవిక్రయాలు వంటి వాటిపై శిక్షణ ఇచ్చి ప్రారంభించనున్నారు.