భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..ప్రశ్నించినందుకు పిల్లల్ని కొడతారా? : ప్రియాంకా గాంధీ
ఢిల్లీలోని గాంధీ స్మృతికేంద్రం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ, మహాత్మా గాంధీ సహా అనేక మంది ప్రాణత్యాగం చేసి సాధించిన ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అంతం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పరీక్షల నిర్వహణలో వైఫల్యంపై ప్రశ్నించినందుకు విద్యార్థులను కొడతారా? అని ఆమె మండిపడ్డారు.

కేంద్రం చేస్తున్న తప్పు అందరికీ తెలుస్తుందని ఆమె అన్నారు. కాగా, CJPకి మద్దతుగా నిరసన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే.
