భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..మహిళలు, రైతుల అభ్యున్నతే మా లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి మెగా రైతు మేళాను ప్రారంభించారు.

మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, 9 రోజుల్లోనే రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని, ఇప్పటికే రూ.67 వేల కోట్లు ఇచ్చామని, రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని భట్టి స్పష్టం చేశారు.
