రాష్ట్రంలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రాష్ట్రంలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్‌బ్యాక్‌) తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా వ‌చ్చే విద్యా సంవత్సరం నుంచి పంపిణీ, వాటి రంగులు ఇత‌ర అంశాల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…విద్యార్థుల‌కు యూనిఫాంల అంద‌జేత‌పై ముఖ్య‌మంత్రి గారు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలు, వ‌స‌తి గృహాల్లో చ‌దివే విద్యార్థులకు అంద‌జేసే యూనిఫాంల నాణ్య‌త‌ విషయంలో రాజీప‌డ‌బోమ‌ని స్పష్టంగా చెప్పారు.

ఆగ‌స్టు 15వ తేదీ నాటికి పిల్ల‌లంద‌రికీ యూనిఫాం అంద‌జేయాల్సిన‌దేన‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఈ విష‌యంలో అల‌సత్వం వ‌హిస్తే స‌హించ‌న‌ని హెచ్చ‌రించారు. మ‌హిళా సంఘాలు కుట్టు ప‌ని వేగ‌వంతం చేసేలా క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సెర్ప్ సీఈవో దివ్య‌ గారికి సూచించారు.