భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ.ఇండియాలో సోషల్మీడియా బ్యాన్!.. మోదీ హింట్ ఇచ్చారా? ….
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రిస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో గురువారం జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ, “ఇది భారత్తో పాటు ప్రపంచం నేర్చుకోవాల్సిన మంచి ఉదాహరణ. మేము మీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు.
దీంతో భారత్లోనూ మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే అవకాశం ఉందా?, మోదీ హింట్ ఇచ్చారా? అనే చర్చ మొదలైంది.

అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
