పవన్ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స..

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..పవన్ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శనివారం పవన్ కళ్యాణ్ భుజానికి వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు.

జూన్ నెలాఖరులో ఆయన ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా.. భుజాలకు తక్షణం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అందులో భాగంగా శనివారం ఒక భుజానికి తొలుత ఆపరేషన్ చేయనున్నారు.

కొద్దిరోజుల విరామం తర్వాత మరో భుజానికి ఆపరేషన్ చేయనున్నారు. శస్త్రచికిత్స తర్వాత కొద్దిరోజులు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు….