దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ అంబులెన్స్’ సేవలు ప్రారంభం

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ అంబులెన్స్’ సేవలు ప్రారంభం

విద్యుత్ అత్యవసర సమస్యల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ అంబులెన్స్’ సేవలను బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.

వైద్య అత్యవసరాల్లో 108 సేవలు అందించే తరహాలోనే ఈ సేవలు పనిచేస్తాయి.

తీగలు తెగిపడటం, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు వంటి ఆకస్మిక అంతరాయాలు ఏర్పడినప్పుడు ఈ ప్రత్యేక బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటుంది.

ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన ఈ సేవలను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.