ఏపీలో ముందు పట్టణాలు.. అనంతరం పంచాయతీ ఎన్నికలు!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీలో ముందు పట్టణాలు.. అనంతరం పంచాయతీ ఎన్నికలు!

అమరావతి :

ఏపీలో మొదట మున్సిపల్, ఆ తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబరు, అక్టోబరుల్లో ఎన్నికలు ఉంటాయన్న సీఎం ప్రకటనతో అధికారులు.. 23 మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనంపై ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి ఏజీతో సంప్రదింపులు జరుపుతున్నారు. 3,816 నుంచి 4,803కి పెరిగిన వార్డుల పునర్విభజనపై హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలను అధిగమించేందుకు కసరత్తు చేస్తున్నారు.